పేద రైతుల కోసం ట్రాక్టర్లను ఉచితంగా అందిస్తున్న మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు దాతృత్వంలో అందరి హీరోలను ముంచిపోతున్నాడు. ఇప్పటికే చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేస్తూ మనుషుల్లో దేవుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పేదల రైతుల సమస్యలను గుర్తించిన మహేష్ బాబు వారికి ట్రాక్టర్లను అందజేయడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి తెలుసుకున్న అభిమానులు మహేష్ బాబును బాగా పొగిడేస్తున్నారు. అందరి గురించి మీరు ఒక్కరే మంచిగా ఆలోచించగలరన్నా అంటూ పొగడ్తలతో అతడిని ముంచెత్తుతున్నారు.

సాధారణంగా పేద రైతులకు పంట పండించాలని ఉన్నా, వారికి పండించగల సామర్థ్యం సైతం ఉన్నా సరే పంట ఖర్చులను భరించలేక వెనకడుగు వేస్తుంటారు. ముఖ్యంగా దున్నే ఖర్చులు, ఇంకా ట్రాక్టర్ల వంటి మెషిన్లతో చేసే ఖర్చులను భరించలేకపోతున్నారు. అందుకే మహేష్ బాబు వారి బాధలను అర్థం చేసుకొని ట్రాక్టర్లను ఫ్రీగా ఆఫర్ చేయడం ప్రారంభించాడు. మహేష్ మొత్తం గా 50 ట్రాక్టర్లను పేద రైతులకు ఫ్రీగా అందించాడు.

టాలీవుడ్ హీరో మహేష్ చేసిన ఈ ఉదాత్తమైన చర్య సినీ పరిశ్రమలోనే కాకుండా సాధారణ ప్రజల నుంచి ప్రశంసలను పొందింది. అసలైన హీరో అంటే బాధలో ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపేవాడని, ఆ లక్షణాలు మహేష్ బాబులో మెండుగా ఉన్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. రైతుల సంక్షేమం పట్ల మహేష్ బాబుకు ఉన్న శ్రద్ధ, వారి కష్టాలను తగ్గించడానికి అతను చేస్తున్న ప్రయత్నాలు ఇతరులకు ఒక అద్భుతమైన స్పూర్తిగా నిలిచాయని అంటున్నారు.

ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చేయడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ కానుంది. హై ఇంటెన్స్ యాక్షన్ సినిమాగా ఇది ప్రేక్షకులను పలకరించనుంది.