Ap Cabinet: 24 మంది మంత్రులు సీఎం జగన్ కి రాజీనామాలు సమర్పించారు..!!

Ap Cabinet: గురువారంనాడు జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీ తర్వాత 24 మంది తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేసి సీఎం జగన్ కి సమర్పించారు. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ సమావేశానికి కాళీ లెటర్ హెడ్ లతో వెళ్లిన మంత్రులు… కేబినెట్ భేటీ అనంతరం వాటి పైన తమ రాజీనామాలు చేసి… ఒక్కొక్కరు సీఎం జగన్ చేతికి ఇచ్చారు. త్వరలోనే ఈ రాజీనామా లేఖలను సీఎం జగన్ గవర్నర్ కి సమర్పించనున్నట్లు సమాచారం.

రాజీనామా చేసిన మంత్రులు... ముగిసిన క్యాబినెట్ సమావేశం..

గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై చర్చ తో పాటు… కొత్తపేట పులివెందుల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ఇదే క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ సహా క్యాబినెట్ మంత్రులు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ నీ అభినందించారు.