Purendeshwari: పవన్ పార్టీతో పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..!!

Purendeshwari: బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో.. పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తాం. రాష్ట్రంలో పార్టీల పరంగా కార్యక్రమాలు వేరైనా బీజేపీ.. జనసేనతో పొత్తు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

If my party workers spit, your Cabinet will be swept away': BJP leader to Baghel- The New Indian Express

ఇక ఇదే తరుణంలో దేశంలో మోడీ నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలవడం జరిగిందని తెలిపారు. మోడీ విజన్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా దేశంలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తారు అని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని.. పురందేశ్వరి సూచించారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలతో వివరిస్తాం. పెట్రోల్ డీజిల్ ఛార్జీల విషయంలో కేంద్రం తన వంతు బాధ్యతగా ధరలు తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించటం లేదని నిలదీశారు. దీంతో పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.