Ap Cabinet: ఆ జిల్లాలో ఏకంగా ముగ్గురు మంత్రులు..!!

Ap Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకి అగ్రతాంబూలం అందించారు. ఏకంగా ముగ్గురు కి మంత్రి పదవులు లభించటం జరిగింది. పాత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నారాయణ స్వామి లను కొనసాగించిన జగన్.. ఈసారి నగరి ఎమ్మెల్యే రోజా కి.. మంత్రి పదవి అందించడంతో ఈ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించే మంత్రుల సంఖ్య మూడు కు చేరుకుంది. ఈ పరిణామంతో చిత్తూరు జిల్లా వైసీపీ పార్టీ క్యాడర్ ఆనందంలో మునిగిపోయింది. స్వీట్లు పంచుతూ బాణాసంచా కాల్చుతూ వైసీపీ కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. చంద్రబాబు సొంత జిల్లా కావడంతో కచ్చితంగా ఈ పరిణామం వచ్చే ఎన్నికలలో జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి భారీ ఇబ్బంది అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.