Big Breaking: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మిగలటం అందరికీ తెలిసిందే. అయితే సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని హామీ ఇవ్వటం.. తాజాగా ఏప్రిల్ 4వ తారీకు 26 జిల్లాల ఏపీని ప్రకటించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా రానున్నట్లు మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
విషయంలోకి వెళితే గిరిజన ప్రాంతాలను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు.. కొత్త జిల్లా వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేశారు. ఇదే జరిగితే ఇరవై ఆరు జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం… 27 జిల్లాలు గా మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాలను ఇప్పటికే రెండు జిల్లాలు చేశారు భవిష్యత్తులో మరో జిల్లా చేయడానికి సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.