యాంకర్ గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని.. ఆ క్రేజ్ తో సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది. జబర్దస్త్ లో చలాకీగా ఉంటూ తన యాంకరింగ్ తో యువతను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ షో తో మరింతగా షో కి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. దాదాపు 8 సంవత్సరాల పాటు నిర్విరామంగా యాంకర్ గా పనిచేసిన అనసూయ ఇటీవల జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి స్టార్ మా లో సింగింగ్ కాంపిటీషన్ కి హోస్టుగా వ్యవహరించింది.
ప్రస్తుతం అక్కడ కూడా గుడ్ బై చెప్పేసి సినిమాలపై దృష్టి పెట్టింది అనసూయ. తాజాగా అనసూయ రంగమార్తాండ , పుష్ప 2 వంటి సినిమాలలో నటిస్తోంది. అయితే అనసూయ ఖాళీ సమయం దొరికితే చాలు తన స్నేహితులతో బంధుమిత్రులతో విదేశాలకు వెళ్తూ అక్కడ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్యామిలీని వదిలి అమెరికాకు వెళ్లిన అనసూయ అక్కడ తన చెల్లెలు వింధ్య కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంది. మొన్నటివరకు విదేశీ వనితను తలపించే విధంగా దుస్తులతో ఫోటోలకు ఫోజులిచ్చిన అనసూయ నిన్న తన చెల్లెలు..
చెల్లెలు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. మరి ఈరోజు అమెరికాలోని అక్కడ అడవులు తుప్పల్లో తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అనసూయ. ఈ ఫోటోలను షేర్ చేస్తూ వింధ్య, విశాఖ లతో హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్యాగ్ కూడా చేసింది. అక్కడ తన చెల్లెలు వింధ్య అలాగే మరొక అమ్మాయి విశాఖ లతో అమెరికా అడవుల్లో తుప్పల్లో పొట్టి నిక్కరు ధరించి తన అందాల ఆరబోతతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన తర్వాత నెటిజెన్స్ “ఏం చేస్తున్నావ్ మహాతల్లి” అంటూ కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు ఈ ఫోటోలపై పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు మరి కొంతమంది నెటిజన్స్. అనసూయ షేర్ చేసిన ఫోటోలు, వీడియో కూడా బాగా వైరల్ గా మారుతోంది.
View this post on Instagram