Naresh Pavitra: నరేష్ పవిత్ర లోకేష్ లో రిలేషన్ లో ఉన్నారంటూ గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియా వార్తలు వస్తుండగా వాళ్ళిద్దరూ వాటిని కొట్టి పారేశారు.. ఇక వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ ఓ హోటల్ గదిలో కలిసి ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని మీడియాకు పట్టించింది.. ఇటీవల నరేష్ పవిత్ర మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు ఓ వీడియో అధికారికంగా పోస్ట్ చేశారు.. దాంతో రమ్య మళ్ళీ ఈ విషయంపై స్పందించారు..
![Naresh Pavitra Lokesh marriage is impossible because Ramya raghupati have good avidance](https://dailytelugunews.com/wp-content/uploads/2022/07/Naresh-1-300x163.jpg)
నరేష్ కి నాకు ఇప్పటికీ విడాకులు అవ్వలేదని.. నేను ఇప్పటికీ నరేష్ కి భార్య నేనని .. నాకు విడాకులు ఇవ్వకుండా పవిత్రని తను ఎలా పెళ్లి చేసుకుంటారని రమ్య మీడియా ముఖంగా ప్రశ్నించారు.. అయితే నరేష్ కి రమ్యకి విడాకులు మంజూరు కాకపోవడానికి భరణం సమస్య కాదని సమాచారం. భరణమే కారణమై ఉంటే నరేష్ ఈపాటికి ఎప్పుడో సెటిల్మెంట్ చేసే వాళ్ళని.. ఈ సమస్య ఇద్దరి ఈగోలకి సంబంధించినది.. అందుకే ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారని సమాచారం. నరేష్ పవిత్రను పెళ్లి చేసుకోవడానికి విడాకులు తీసుకోకపోవడం రమ్యకి కొండంత బలం అని.. ఇప్పుడు ఆ బలాన్ని అడ్డు పెట్టుకొని రమ్య మరోసారి మీడియా ముందుకు వచ్చి నరేష్ ను హెచ్చరించింది..