Smart TV Offers : ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించే దిశగా పలు స్మార్ట్ టీవీ కంపెనీలు కూడా స్మార్ట్ స్పీకర్లను ఆఫర్ గా ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం షావోమీ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీ కొంటే స్మార్ట్ స్పీకర్ ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. షావోమి ఇండియా.. ప్రవేశపెట్టిన షావోమీ స్మార్ట్ టీవీ ఫైవ్ ఏ సిరీస్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో 32, 40 , 43 అంగుళాల స్మార్ట్ టీవీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 32 అంగుళాలు స్మార్ట్ టీవీ ధర రూ.13,999 కాగా, 40 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.21,999.. అలాగే 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.24,999..
![Smart TV Offers : స్మార్ట్ టీవీ కొనేవారికి శుభవార్త.. టీవీ కొంటే రూ.2వేల లోపే స్మార్ట్ స్పీకర్ ..! Smart TV Offers Good news for smart TV buyers.. if you buy a tv and get a smart speaker at low cost](https://dailytelugunews.com/wp-content/uploads/2022/11/sa.jpg)
ప్రస్తుతం ఈ వేరియంట్ లో ఏ వేరియంట్ టీవీ అయినా సరే కొనుగోలు చేస్తే రూ.4,999 విలువైన స్మార్ట్ స్పీకర్ ను కేవలం రూ.1999 ధర కే కొనుగోలు చేయవచ్చు. అంటే షావోమీ స్మార్ట్ స్పీకర్ పై మీకు అదనంగా 3000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. షావోమీ అధికారిక వెబ్సైటు లో బండిల్ ఆఫర్ లో స్మార్ట్ స్పీకర్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ టీవీ కొనడానికి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈటీవీ ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ తో వస్తుంది.
అలాగే 24 W సౌండ్ డాల్బీ ఆడియో తో పాటు ప్యాచ్ వాల్ 4 సపోర్ట్, ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టం ఇలాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ లో లభిస్తుంది. అలాగే 300కు పైగా లైవ్ చానల్స్ చూడవచ్చు. వీటితోపాటు బ్లూటూత్ 5.0 సపోర్టు లభిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే..2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 1ఈథర్ నెట్, 1AV, 1ఆప్టికల్ సపోర్టు కూడా లభిస్తుంది.