Sitara Ghattamaneni: ఇటీవల మహేష్ ఇంట్లో పెద్ద విషాదం జరిగిన విషయం తెలిసింతే. మహేష్ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ అయితే ఆ బాధ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాడు. సితార తన నాన్నమ్మని తలచుకుంటూ తెగ ఏడ్చేస్తుందట. ప్రాణంగా ప్రేమించిన నాన్నమ్మ తనకు దూరం కావడం సితార అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. నాన్నమ్మపై ఉన్న ప్రేమతో సితార ఇటీవల ఓ మంచి నిర్ణయం తీసుకుందట . ఇందిరా దేవి పేరు మీద నిత్యం వెయ్యి మందికి అన్నదానం జరిగేలా ప్లాన్ చేసిందని, దీని కోసం తన తండ్రి దగ్గర మనీ అడగకుండా సొంత ఖర్చుతో ఈ కార్యానికి శ్రీకారం చుట్టాలని సితార భావించిందని వార్తలు కూడా వచ్చాయి.
![Sitara Ghattamaneni : ఉదయం నిద్ర లేవడమే తాతయ్య కృష్ణ ఇంటికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా ? సితార ఘట్టమనేని బంగారం రా అసలు ! sitara-news-viral](https://dailytelugunews.com/wp-content/uploads/2022/11/zy.jpg)
Sitara Ghattamaneni : నాన్నమ్మ జ్ఞాపకాలలో..
అయితే ఇందిరా దేవి మరణించి చాలా రోజులే అవుతున్నా కూడా ఆమె జ్ఞపకాలు సితార మదిలో మెదులుతున్నాయట. రాత్రి తన నాన్నమ్మ కలలోకి రావడంతో వెంటనే తాతయ్య ఇంటికి వెళ్లిందట. అక్కడ తన నానమ్మకు సంబంధించి వస్తువులని, ఫొటోలని చూసి వెక్కి వెక్కి ఏడ్చిందట. తన నానమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిందట సితార. ఇక తన ఇంటికి వెళ్లేటప్పుడు నాన్మమ్మ జ్ఞాపకాలకు సంబందించిన వస్తువులని కూడా తనతో పాటు తీసుకెళ్లిందని సమాచారం.
ఇందిరా దేవి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న సమయంలో మహేష్ గారాల పట్టి సితార.. వెంటనే నానమ్మ ఇంటికి వెళ్లి ఆమె మృతదేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో సితారను తండ్రి మహేష్ బాబు ఓదార్చాడు. ఆ సమయంలో సితారకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇప్పటికీ సితార తన నాన్నమ్మ జ్ఞాపకాలతోనే కాలం గడుపుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ ఫ్యామిలీ అంతా విదేశాలకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.