Vivekananda Case : జగన్ కి ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ.. వారికి బెయిల్ నిరాకరణ..

Vivekananda Case :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి ప్రాణాలు తీసిన కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌తో పాటు సీబీఐ, వైఎస్‌ సునీతా రెడ్డి వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్ లపైన సోమవారం హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి..

ఆర్టికల్‌ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నారని.. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదని సునీల్‌ తరఫున న్యాయవాది వాదనలు చెప్పారు. సీబీఐకి పూర్తి స్థాయిలో సునీల్‌ సహకరించారని.. కాగా ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సీబీఐ వారి వాదనలు చెబుతూ.. వైఎస్ వివేకా హత్య కేసు కీలక దశలో ఉందని.. ఇప్పుడు బెయిల్‌ ఇవ్వరాదని హైకోర్టును ఆశ్రయించింది. ఒకవేళ బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసేందుకు అవకాశం ఉందని సూచించింది. రెండు వియాపుకా వాదనలు విన్న హైకోర్టు.. సీబీఐ వాదనలతో ఏకీభవించింది. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సాక్షుల భద్రత ముఖ్యమని పేర్కొంటూ హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

వివేక కేసు దర్యాప్తుకి ఏకదశకు చేరుకుందని హత్యలు రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని కోర్టుకు వివరించింది. సిబిఐ వాదనలో వెన్న తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను నిరాకరించింది.