Upasana : జనంలోకి వెళ్లేందుకు జనసేన అని పవన్ కళ్యాణ్ చేపట్టిపోయే బస్సు యాత్ర కోసం ప్రత్యేకంగా వారాహి అనే వాహనాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఈ వాహనం నుంచే తను ప్రజలలోకి వెళ్తున్నారు. సేనాని సూచనల ప్రకారం ఈ వాహనాన్ని రూపొందించారు. కాగా ఉపాసన జనసేన పార్టీ కోసం ప్రత్యేక బస్సులు రూపొందించింది. అది తెలిసి వైఎస్ఆర్సిపి మంత్రి రోజా అవాక్కయ్యారు..
మంత్రి రోజా నాలుగు మాటలు మాట్లాడితే .. అందులో ఒక మాట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఉంటుంది. ఆయన గురించి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆయన పేరు తెలిస్తే గాని వార్తల్లో ఆమెను చూపించనున్న ఉద్దేశము ఏమో కానీ.. ప్రతి మీటింగ్ లోను ఆయన పేరు ఎత్తకుండా ఆ మీటింగ్ కంప్లీట్ చేయరు రోజా..
జనసేన పార్టీ కోసం ఉపాసన రంగంలోకి దిగింది అని తెలిసి రోజా ఆశ్చర్యపోయినట్లు సమాచారం. అందరికీ సరైన నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటుంది ఉపాసన. అలాగే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే ఆమె రాజకీయ అనుభవాలను చదువుకున్నారు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వెంటనే తనదైన శైలిలో సహాయం చేయడానికి ఉపాసన ప్రత్యేకంగా ఓ బస్సును కొన్నారని తెలుస్తోంది.
జనసేనానికి వారాహి ఎలాగో ఆయన కార్యకర్తలకి కూడా ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాళ్లకి అక్కడ మంచి భోజనాలు వాళ్లకి కావాల్సినటువంటి వ్యవహారాలతో పాటు వారాహిని అనుసరించే విధంగా ఈ వెహికల్ ఉంటుందని తెలుస్తోంది. జనసేన ని మిగతా కార్యకర్తలు కూడా ఆయన వెంటే వెన్నంటే ఉండాలనే ఉద్దేశంతో ఉపాసన ఈ ప్రత్యేక బస్సును రూపొందించినట్లు సమాచారం. మార్బలం, మంది ఉంటేనే బాగుంటుంది .
అందుకే పవన్ వెంట జనాలతో పాటుగా కార్యకర్తలు కూడా ఉండాలని .. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడుతూ ఆయన్ని ప్రొటెక్టివ్ గా ఉంచాలని జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఓ బస్సును రెడీ చేయించిందట ఉపాసన. నిజంగానే ఉపాసన స్ట్రాటజీగా ఆలోచించి నిర్ణయం తీసుకుందని తెలిసి రోజా షాక్ అయినట్లు తెలుస్తోంది.