Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది అన్న తరహాలో నేతల మధ్య మాటల తూటలు పెలుతున్నాయి. ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిన సమయంలో జనసేన అధినేత పవన్ … వైసీపీ ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేయటం తెలిసిందే. అదే సమయంలో కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా టార్గెట్ చేసుకుని హెచ్చరించే రీతిలో మాట్లాడారు.
ఇదిలా ఉంటే తాజాగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి లో ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తాను అంటూ ఓపెన్ చాలెంజ్ అంటూ సవాల్ విసిరారు. పవన్ పోటీచేసే నియోజకవర్గం ఇన్చార్జి గా పోస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన స్వార్ధ రాజకీయాలకోసం జనసేన కార్యకర్తలను మోసం చేస్తున్నారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. త్వరలోనే జనసేన కార్యకర్తలు భాధపడతారని కూడా జోస్యం చెప్పారు.