Veera Simha Reddy: సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లు గా శృతిహాసన్ ,హనీరోజ్ నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ నెగటివ్ రోల్స్ చేశారు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా.. మొదటి రోజు మొదటి షోకే బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు కూడా లభిస్తున్నాయి. అయితే బాలయ్య సినిమాకు పోటీగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . బాలయ్య సినిమాతో పోల్చుకుంటే చిరంజీవి సినిమాకు కలెక్షన్ పరంగా అదనంగా నాలుగు కోట్ల రూపాయలు ముందంజలో ఉంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఫ్లాప్ ఫ్లాప్ అని వాగుతోన్న మెగా ఫ్యాన్స్ నోరు మూయించేలా వీరసింహా రెడ్డి 10వ రోజు లెక్కలు చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.
నైజాం ఏరియాలో రూ.16.26 కోట్లు , సీడెడ్ రూ.15.70 కోట్లు, యూ ఏ రూ.7.14 కోట్లు, ఈస్ట్ రూ.5.37 కోట్లు, వెస్ట్ రూ.4.03 కోట్లు, గుంటూరు రూ.6.18 కోట్లు , కృష్ణ రూ.4.48 కోట్లు , నెల్లూరు రూ.2.79 కోట్లు, కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ.4.64 కోట్లు.. ఓవర్సీస్ లో రూ.5.65 కోట్లు లభించగా.. మొత్తం 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 72.24 కోట్ల షేర్ రూ. 121.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా రూ. 74 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. మరో 1.76 కోట్ల షేర్ కలెక్షన్ రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఈ సినిమా కలెక్షన్స్ చూసి మెగా అభిమానుల నోరు మూతపడ్డాయని చెప్పడంలో సందేహం లేదు.