Sri Reddy : శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండింగ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను ఎత్తిచూపుతో తన ఫేస్బుక్లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది..
కందుకూరు లో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.. దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.. కందుకూరులో చనిపోయిన ఎనిమిది మంది సమిధలు అవుతారని చంద్రబాబు నాయుడు అన్నారు. మీ త్యాగం పార్టీకి మేలు చేస్తుందన్నారు. నా సభల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లంతా రాష్ట్రానికి మేలు చేసిన వారన్నారు చంద్రబాబు నాయుడు.. దానికి కౌంటర్ గా శ్రీరెడ్డి అదేదో నువ్వే చేయొచ్చు కదా బాబు.. రాష్ట్రం బాగుపడుతుంది.. అని ఓ క్యాప్షన్ ని జోడించింది ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. విచిత్ర ఏమిటంటే ఈ పోస్టును ఎక్కువమంది లైక్ చేస్తున్నారు.. మొన్నేమో చంద్రబాబు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారని చంద్రబాబు అండ్ బ్యాచ్ ని కలిపి లైవ్ లో ఏకిపారేసిన శ్రీరెడ్డి.. ఇప్పుడు నేరుగా చంద్రబాబు ఫోటోని షేర్ చేస్తూ ఈ కామెంట్ కూడా చేయడం ట్రెండ్ అయ్యింది.