Prabhas : బాహబులి సినిమాతో తన స్థాయిని పెంచుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. ఆయన నుండి వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా నిరాశపరిచాయి. త్వరలో ఆదిపురుష్తో అలరిస్తాడని అందరు అనుకున్నారు. కాని టీజర్ చూసి అందరు నిరాశ చెందారు. పౌరాణిక చిత్రాలలో సీతారాములను చూపించిన తీరు వేరుగా ఉంటుంది. రావణుడి పాత్రను .. హనుమంతుడి పాత్రను ఆవిష్కరించిన విధానం కాస్త డిఫరెంట్. అందుకు భిన్నంగా ఆదిపురుష్ సినిమాలోని వేషధారణ ఉండటం అభిమానులను నిరాశ పరిచింది.
![Prabhas : ప్రభాస్ అభిమానులకి కిక్కిచ్చే న్యూస్.. ఈ వార్త వింటే ఎగిరి గంతులేయడం ఖాయం..! prabhas-fans-happy-with-this-news](https://dailytelugunews.com/wp-content/uploads/2022/11/14-1.jpg)
గుడ్ న్యూస్..
టీజర్ లో గ్రాఫిక్స్ సరిగా లేవనే టాక్ వచ్చింది. ప్రభాస్ ఉదాసీన వైఖరిని ఆసరాగా తీసుకుని మేకర్స్ ఇలా వ్యవహరించారంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందువల్లనే సంక్రాంతికి రావలసిన ఈ సినిమాను 6 నెలల పాటు వాయిదా కూడా వేశారు. ఈ ఆరునెలల్లో గ్రాఫిక్స్ వర్క్ లో నాణ్యత తీసుకురావడం .. కొన్ని సీన్స్ ను రీషూట్ చేయడం జరిగే అవకాశం ఉందట. ఇక ఈ సినిమా బడ్జెట్ మరో 100 కోట్లు పెరిగే అవకాశం ఉందని , ప్రభాస్ అభిమానుల్లోని అసంతృప్తిని పోగొట్టడానికి ఇలా చేస్తున్నారని అంటున్నారు.
ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో ఫ్యాన్స్ కు ఓ హ్యాపీ న్యూస్ అందుతుంది. ఓవర్ సీస్ రైట్స్ సరిగమ సినిమాస్ వారు ఈ చిత్ర హక్కులు తీసుకోబోతున్నట్లు సమాచారం. సరిగమ సినిమాస్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తే కొన్ని లాభాలు తప్పక ఉంటాయి . జూన్ నెలలో ఎన్ని హాలీవుడ్ సినిమాలు ఉన్నా తమకున్న పలుకుబడితో ఆదిపురుష్ సినిమాకు మంచి థియేటర్స్ యూఎస్లో ఇవ్వగలుగుతారు. సినిమా బాగుంటే కలెక్షన్స్ బాగుంటాయి. ఈ సినిమాకు వచ్చిన అతి పెద్ద పాజిటివ్ న్యూస్ ఇదే అంటూ కొంతమంది అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు.. ఈ చిత్రంలో సీతా పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించి అలరించనున్నాడు..