Pattabhi: తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ నేత పట్టాభితో సహా 16 మంది టీడీపీ నేతలను కృష్ణాజిల్లా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాసేపట్లో ఈ నేతలను పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. కొల్లు రవీంద్రను కూడా చిల్లకల్లు వద్ద అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనని విజయవాడకు తరలిస్తున్నారు.. మొత్తంగా గన్నవరం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారని సమాచారం. దాడులు ప్రతిదాడులలో గన్నవరం అట్టుడికింది.. వంశీ అనుచరులు, టిడిపి నేతల దాడుల్లో పలు కారులు కూడా దగ్ధమయ్యాయి..
గన్నవరం నియోజకవర్గంలో వంశీ అల్లర్లు ప్రేరేపిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా.. బయట వ్యక్తులకు నియోజకవర్గంలో పనేంటి అని వల్లభనేని వంశీ కూడా ప్రయత్నిస్తున్నారు.. డిజిపి ఆఫీసుకు వెళ్లేందుకు పట్టాభి భార్య చందన ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.. దాంతో ఆమెను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో..ఆమె మాత్రం తన ఇంట్లోనే నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు.