Krishnam Raju : ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి చాలా ముద్దు ముద్దుగా క్యూట్గా కనిపిస్తుంది కదా, ఆమెని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఎత్తుకొని ఉండగా, ఈ ఫొటో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే కృష్ణం రాజు ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరు అని ప్రతి ఒక్కరు ఆరాలు తీస్తున్నారు . ఈ అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్గా ఓవెలుగు వెలిగింది. అంతేకాదు టాప్ హీరోలందరితో కలిసి నటించింది. సినీ పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.
ఎవరో చెప్పుకోండి..
![Krishnam Raju : ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా .. మొన్ననే ఆమె భర్త చనిపోయాడు ! guess-this-child-artist-name](https://dailytelugunews.com/wp-content/uploads/2022/11/ae5.jpg)
వెంకటేష్ నటించిన ఓ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ క్లూస్తో ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎస్ ఆమె మరెవరో కాదు మీనా. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మీనా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఆమె నటించిన సినిమాలు మంచి హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషలలో సినిమాలు చేసి సత్తా చాటింది. నాలుగు దశాబ్దాలుగా నటిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న మీనా తన కూతురు నైనికాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసిన విషయం తెలిసిందే.
మీనా.. తమిళ సినిమా ‘నెంజగల్’ తో బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అలరించింది. ఇక తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘సిరిపురం మొనగాడు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి పలు సినిమాల్లో బాలనటిగా కూడా మెప్పించింది. కన్నడ తప్ప మిగతా భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించిన మీనా, హీరోయిన్గా రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ హీరోలుగా నటించిన ’నవయుగం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఒకప్పుడు టాలీవుడ్ని ఏలింది. ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆమె తీవ్ర విషాదంలో ఉంది.