Breaking: సీఎం కెసిఆర్ పర్యటన రద్దు.. ముఖ్యమంత్రి స్థానంలో మంత్రులు!

సీఎం కెసిఆర్ నేటి వరంగల్ పర్యటన రద్దయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే, రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు భారీస్థాయిలో నష్టపోయిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే… సీఎం కెసిఆర్ నష్టపోయిన రైతులకు పదివేలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, కొన్ని అనుకోని కారణాల వలన కెసిఆర్ ఈ ప్రోగ్రాంకి హాజరు కాలేకున్నారు. దాంతో ఆయన పర్యటన రద్దు కావడంతో సదరు కార్యక్రమానికి ఆయన స్థానంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి వెళుతున్నట్టు సమాచారం.

ఇకపోతే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ పక్క ప్రణాళికలు రచిస్తోంది. జూన్ 2న సదరు కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేంత గ్రాండ్‌గా జరుపుతారని టాక్ వినబడుతోంది. ఈ వేడుకల నిర్వహణపై గత కొద్దిరోజులుగా అధికారులతో కేసీఆర్ జోరుగా సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు ఇప్పటినుంచే చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.