Balakrishna: ఇదిగో రోజా ఒకటి గుర్తు పెట్టుకో .. బాలయ్య మాస్ వార్నింగ్ !

Balakrishna: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారి పల్లెలో జరిగిన భోగి సంబరాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. అక్కడకి వచ్చిన టిడిపి నేతలు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగిమంటలో వేసి వినూత్నంగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తుంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించినట్లు ఉంది. ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని జారీ చేయడమే ఎందుకు నిదర్శనం అని బాలకృష్ణ అన్నారు..

Balakrishna waring Ysrcp minister Roja
Balakrishna waring Ysrcp minister Roja

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం లో శెట్టిపల్లి లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి రోజా ఈ విషయంపై స్పందిస్తూ బాలకృష్ణకి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చెప్పడం మాత్రమే వచ్చు.. అన్ స్టాపబుల్ షో కి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే .. వీరసింహారెడ్డి సినిమాకి స్క్రిప్ట్ మరొకరు రాసిచ్చారు. జీవో నెంబర్ 1 లో అసలు ఏముందో బాలకృష్ణ చదివారా.. చదివి ఉంటే ఆయన ఈ విధంగా మాట్లాడేవారు కారు.. ఏదో బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు..

 

జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా పండగ చేసుకుంటుంటే.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతోందని బాలకృష్ణ అనడం చాలా బాధాకరం. ఆయన సినిమాలో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఆనందించడానికి పనికి వస్తాయేమో.. కానీ వాటితో రాష్ట్రం బాగుపడదు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందని రోజా అన్నారు..

 

ఈ మాటలకు బాలకృష్ణ రోజాకి కౌంటర్ ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. జీవో నెంబర్ 1 మేము చదవడం కాదు.. ముందు మీరు చదివారా లేదా అనేది గమనించండి.. జీవో నెంబర్ 1 ప్రజాహితం కోసమే జారీ చేసినది అయితే.. రాజ్యాంగబద్ధంగా ఉందని హైకోర్టు భావించి ఉంటే.. దానిని అమలు చేయకుండా స్టే ఎందుకు ఇచ్చింది అనే ప్రశ్నకు రోజా సమాధానం చెప్పాలని.. అసలు నువ్వు రాజకీయాల్లోకి వచ్చిందే మా పార్టీ వల్ల.. అది గుర్తుపెట్టుకో రోజా అని బాలకృష్ణ రోజా కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం..