Dil Raju: టాలీవుడ్ టాప్ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు.. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.. 2017లో దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్ రాజు తేజస్విని వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అయితే దిల్ రాజుకు తేజస్వినికి అలా పరిచయం అయింది.. వారి ప్రేమ ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం..
దిల్ రాజు తనకు ఎలా పరిచయమయ్యారని విషయాన్ని తేజస్విని చెబుతూ.. నేను అమెరికా వెళ్లి పీహెచ్ డీ చేయాలని అనుకున్నాను.. నేను ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న సమయంలో దిల్ రాజు రెగ్యులర్ గా ట్రావెల్ చేసేవారు.. మొదటిసారి నన్ను ఆయన కలిసినప్పుడు పెన్ అడిగారు.. నేను షిఫ్ట్ లో ఉన్న ప్రతిసారి ఆయన విమానంలో కనిపించేవారు.. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.. దిల్ రాజు కి ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని తేజస్విని చెప్పింది.
ఈ విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ నా మొదటి భార్య అనిత మరణించిన తరువాత రెండేళ్లు చాలా కష్టాల్ని అనుభవించాను. నాకు అప్పటికే 47 ఏళ్లు ఉన్నాయి జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నా సమయంలో రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి కానీ నా బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి కావాలనుకున్నాను .
అదే సమయంలో నేను విమానం లో ప్రయాణం చేసే సమయంలో తేజస్విని పరిచయమైంది. ఫోన్ నెంబర్ తీసుకొని సుమారు ఏడాది పాటు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ జర్నీ తర్వాత ప్రపోజ్ చేయడం.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి చర్చలు జరపడం.. చివరికి పెళ్లి వరకు వెళ్ళింది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక తేజస్వినిలో తనకు నచ్చింది.. తను గ్రౌండ్ టు ఎర్త్ కావడమే అని తెలిపారు.