Anasuya: న్యూస్ రీడర్ గా తన కెరియర్ మొదలుపెట్టిన అనసూయ.. జబర్దస్త్ షో తో అనూహ్యమైన గ్రాఫ్ ను అందుకుంది. బుల్లితెర నుంచి వెండి తెర వరకు ఎదిగింది. సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేయగా అది నెట్టింట వైరల్ అవుతుంది..
నిత్యం తన గ్లామరస్ ఫ్యాషనబుల్ ఫోటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది అనసూయ. అందులో భాగంగా తాజాగా షేర్ చేసిన వీడియో లో నేను ఓ డిజాస్టర్ తో బాధపడుతున్న.. నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వారిని అస్సలు లెక్కచేయను.. వారి గురించి పట్టించుకోకపోవడం నా రుగ్మత అంటూ.. అసలు విషయాన్ని బయటపెట్టింది..
ఈ నేపథ్యంలోనే తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన ట్రోల్ చేసిన తను లెక్కచేయడంటూ.. తనకు తోచిందే చేస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది అనసూయ. రంగమ్మతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది.
పుష్పలో ద్రాక్షాయినిగా మెప్పించిన అనసూయ చేతిలో ప్రస్తుతం పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాల్లోనూ నటిస్తోంది అలాగే గురజాడ అప్పారావు క్లాసికల్ నాటకం కన్యాశుల్కం ఆధారంగా తేరకెక్కుతున్న కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇందులో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్ లో అనసూయ నటించినున్నట్లు టాక్.