Breaking: కమెడియన్ అలీ చిత్తూరు పర్యటనలో జనసేనని పై పోటీ చేస్తానని చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేయడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ పోటీ చేయమని చెబితే పవన్ కల్యాణ్ పై నేను పోటీ చేస్తానని అలీ ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తాను అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున బరిలోకి దిగుతానని క్లారిటీ ఇచ్చారు.. అంటే పవన్ ఎక్కడి నుండి పోటీ చేసినా నేను అతని పోటీ చేస్తానని స్పష్టం చేశారు..
చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నా అలీ 2024లో జరిగే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ గెలిచి తీరతరని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 175 స్థానాలు వస్తాయని అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి మెజారిటీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కవని అలీ అన్నారు.
పవన్ కల్యాణ్ ఓ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా ప్రవర్తించట్లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆయనపై తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.. అధిష్టానం చెబితే నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను పవన్ కల్యాణ్ పై నిల్చుంటానని అన్నారు.
వైఎస్ జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యాని.. అవే తమను శ్రీ రామ రక్ష అవే గెలిపిస్తాయని అన్నారు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంలల్లో ఓడిన ఆయన రోజాను విమర్శించడంలో అర్థం లేదని అన్నారు. డైమండ్ అనేది చాలా పవర్ పుల్ అని, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా అలాంటి డైమండ్ అని చెప్పుకొచ్చారు.