Deepam : దీపం కొండెక్కితే ఈ పనులు చేయకండి..!!

Deepam : హిందూ ధర్మశాస్త్రంలో హైందవ జీవన విధానంలో పూజలు .. ఇంటిలో దీపాలకు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా దీపం చేసిన తరువాత కొద్దిసేపటికి దీపాలు కొండెక్క గానే..ఆ దీపాలు లోకానికి చేరుకొని ఆ ఇంటి ఇల్లాలి యొక్క భక్తి, వినయం, సంస్కారం గురించి ఆ లోకంలో చర్చించుకుంటాయని.. మరల దీపారాధన సమయానికి ఆ ఇంటి ఇల్లాలి ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఆ దీపాలు ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఏ ఇంటిలో అయితే దీపాలు సమయానికి గృహానికి ఆహ్వానించబడతాయో ఆ ఇంటి దీపాలు ఆ లోకంలో అంత గౌరవించబడతాయట. దీపారాధన చేయకుండా..

ఎప్పుడూ కానీ ఆహ్వానించబడని దీపాలు ఆ లోకంలో తోటి దీపాలు ముందు మన ఇంటి దీపాలు అయినందుకు అవి బాధ పడుతూ ఉంటాయట.దీపాల లో కొద్దిగా నూనె వేసి వెలిగించి నూనె అయిపోగానే కొండెక్కాయి అని అనుకుంటారు. దీపానికి ఒత్తి కొనలో గూడు లాగా ఏర్పడుతుంది కదా.. ఆ గూడును ఎప్పుడూ కూడా నలపకూడదు. ఎందుకంటే నూనె అయిపోయినా..కూడా దీపం యొక్క జ్యోతి అందులోనే ఉంటుంది. ఆ ఇంటి యజమాని , పిల్లలు క్షేమంగా ఉండాలని, జాగ్రత్తగా ఇల్లు చేరుకోవాలని ఆ దీపం ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుందట. ఇంటికి వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలికి తోడుగా ఉండి క్షేమం కోసం ప్రార్థిస్తూ అందులోనే ఉంటుందట దీపం. దీపం కొండెక్కగానే ఒత్తి ఉండడం వల్ల గూడును నలపరాదు…

These things work if the Deepam goes up
These things work if the Deepam goes up

దీపం వెలుగు మెదడు యొక్క యోగ్యతను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా దీపం లో ఒక్కో భాగాన్ని ఒక్కో దేవతా స్వరూపం అని చెపుతారు. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, శిఖర భాగంలో శివుడు.. వెలుగులో సరస్వతీదేవి ..నిప్పు కనికలలో లక్ష్మీదేవి ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి.వంటింటి ఆగ్నేయ మూలలో దీపాన్ని వెలిగించాలి. ఈ మూల లో తప్పులు చేస్తే ఇంట్లో అన్ని అనర్ధాలు కలుగుతాయి. అందుకే మీ స్టౌ పక్కన ఆగ్నేయ మూలలో చిన్న ముగ్గు వేసి ఉదయం ఏ నూనెతో అయినా దీపం పెడితే సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.