Lakshmi Devi : శాస్త్రాన్ని పాటించే వారి కుటుంబంలో సానుకూలత, సంతోషం కలగడమే కాదు.. ధనప్రాప్తి, సిరి సంపదలు పెరుగుతాయి అని చెబుతారు. ఇకపోతే జ్యోతిషశాస్త్రం ప్రకారం గృహస్థులకు అనేక విషయాలపై సమాచారాన్ని వాస్తు శాస్త్రం అందిస్తుంది కాబట్టి వాటిలో ఒకటి సిల్వర్ ఫిష్ అని చెప్పవచ్చు. సిల్వర్ ఫిష్ లక్ష్మీదేవి తో సంబంధం కలిగి ఉంటుందని అందుకే దీనిని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని నమ్ముతారు. ముఖ్యంగా వెండి లేదా ఇత్తడి తో తయారు చేసిన చేపలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతుంది. కష్టాలకు కారణమైన వాటిని నివారిస్తుంది అని శాస్త్రం చెబుతోంది.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే తప్పకుండా వెండి లోహం తో తయారు చేసిన చిన్న చేపలను తీసుకువచ్చి ఇంటి యొక్క నిర్దిష్ట దిశలో ఉంచాలి. అయితే నిజమైన చేపలు అక్వేరియంలో వెండి చేపలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఉత్తర ప్రదేశ్ , మధ్య ప్రదేశ్ , బుందేల్ ఖండ్ వంటి ప్రాంతాలను వెండి చేపలు ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. బుందేల్ఖండ్ వంటి ప్రాంతాలలో కూతురు పెళ్ళిలో అమ్మాయికి, అల్లుడికి వెండి చిన్న చేపలు ఇస్తారు. ఇలా ఇవ్వడం వెనుక అమ్మాయి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకూడదు అన్న ఉద్దేశంతో ని ఇలా ఇవ్వడం జరుగుతుంది.
కొంతమంది తమ కెరియర్లో విజయం సాధించడానికి వెండి లోహం తో తయారు చేసిన చేపలను ఆఫీసులో అలాగే ఇంట్లో కూడా పెట్టుకుంటారు. అంతేకాదు పర్సులో చిన్న వెండి చేపలు పెట్టుకోవడం వల్ల ఎప్పుడూ నిండుగా ఉంటుందట . తమ పనిలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కూడా ఉదయం లేవగానే వెండి చేపలను చూస్తారో ఇలా చూడడం వల్ల వారి వ్యాపారంలో పురోగతి వస్తుందని నమ్మకం. శాస్త్రం ప్రకారం వెండి లేదా ఇత్తడి తో తయారు చేసిన చేపలను ఇంటికి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచాలి . ఇలా చేస్తే డబ్బు కి మార్గాలు తెరుచుకోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే డబ్బులు కూడా ఆకర్షిస్తుంది. మీరు కుబేరులవుతారు.