Shani Triodashi : శని త్రయోదశి నేడు..ఇలా చేశారంటే సంపద పెరిగినట్టే..?

Shani Triodashi : ఈరోజు శని త్రయోదశి అంటే శ్రీ మహా విష్ణువు కి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజున శని దేవుడికి ఎవరైతే ప్రత్యేకమైన పూజలు చేస్తారో వారికి ఏలినాటి శని వదిలి పోవడమే కాకుండా దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. శనివారం నాడు త్రయోదశి వస్తే దానిని శని త్రయోదశి అని అంటారు. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది.

ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే ప్రత్యేకమైన పూజలు చేస్తారో ఏలినాటి శని, అష్టమ శని తదితర దోశాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.ముఖ్యంగా హిందూ శాస్త్రం ప్రకారం శనివారం రోజు శ్రీమహాలక్ష్మి , నారాయణుడు అశ్వద్ధ వృక్షం పై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి . అందుకే ఈ రోజున అశ్వత్థ వృక్ష సందర్శన , ప్రదక్షిణ చేయడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుంది. నల్ల నువ్వులు , నువ్వుల నూనె ను నల్లటి వస్త్రంలో ఉంచి దానం చేయడం వల్ల శని తొలగిపోయి ఆర్థిక లాభం పెరుగుతుంది.

Shani Triodashi today if you do this wealth will increase
Shani Triodashi today if you do this wealth will increase

జాతకరీత్యా శనీశ్వరుని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్న వారు ఈ శని త్రయోదశి రోజున గుర్తుపెట్టుకుని విధులు నిర్వహించాలని .. నీలి రంగు పువ్వులతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజ చేయాలి అని సమాచారం.ముఖ్యంగా బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల సమస్యలు తొలగిపోయి శనీశ్వరుడు చల్లని చూపులు మీపై ఉంటాయట . అంతేకాదు ఆర్థిక సంపదకు ఎటువంటి కష్టం నష్టం వాటిల్లకుండా.. డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. శని త్రయోదశి గురించి అందరికీ తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆర్టికల్ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.