Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహించి సంపద పెరగాలి అంటే ఇలా చేయండి..!!

Lakshmi Devi : పేదవాడి నుంచి ధనవంతుడు వరకు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ప్రతిరోజూ చేసే పూజలలో లక్ష్మీదేవి ఫోటో కి లేదా విగ్రహానికి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజ చేస్తూ ధనప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని పూజ చేయాలి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం 108 ఒక రూపాయి బిళ్ళలు తీసుకొని లక్ష్మి అష్టోత్తరం చదువుతూ.. చదివేటప్పుడు ఒక్కో రూపాయి బిళ్ళను అమ్మవారి ఫోటో ముందు ఉంచి అర్చన చేయాలి. ఇక తర్వాత హారతి ఇచ్చి రోజూ ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు. శుక్రవారం మాత్రం ఖచ్చితంగా బెల్లం అన్నం నివేదనగా పెట్టాలి.

ప్రతి రోజు ఇలా చేస్తూ ఉంటే మీరు అపర కోటీశ్వరులు అయిపోతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పు చేయవలసిన అవసరం ఉండదు.. ఒకవేళ మీరు అప్పు చేసి ఉంటే క్రమక్రమంగా అప్పులు తీర్చుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలను ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించదు. పూజ అయిపోయిన తర్వాత మీరు ఉపయోగించిన కాసులు అక్కడే ఉంచి మరుసటి రోజు పూజకు అవే వాడినా ఎటువంటి సమస్య ఉండదు. అయితే వీటిని మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు. అలాగే ఖర్చు పెట్టకూడదు.

Lakshmi Devi should bless and increase wealth so do this
Lakshmi Devi should bless and increase wealth so do this

ఇక మీ సమయాన్ని బట్టి పూజలు ఎన్ని రోజులైనా చేయవచ్చు.ఇక మీరు కాసుల తోనే ఈ పూజ చేయాల్సిన పనిలేదు. తామర గింజలు, పసుపు కొమ్ములతో కూడా పూజ చేయవచ్చు. స్తోమత ఉన్న వారు ఇంకా వెండి లేదా బంగారు పుష్పాలతో కూడా అష్టోత్తర పూజ చేస్తారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనెను దీపారాధనకు ఉపయోగించవచ్చు. ఇక కుబేర పూజకు ధనప్రాప్తి కోసం పూజలో సువాసనగల అగర్బత్తి, సామ్రాని, పుష్పాలు ఉంచాలి. ఇలా చేసినట్లయితే తప్పకుండా ధనప్రాప్తి కలుగుతుంది. పూజల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.