Akshara Trutiya: ఇక ఈ సంవత్సరం మే 3 వ తేదీన అక్షయ తృతీయ జరుపుకోబోతున్నాం. ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకునే సంప్రదాయం మన హిందూ శాస్త్రం లో ఉంది. ఇక అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం , వెండి లేదా ఏదైనా కొత్త వస్తువులను అలాగే సంపద , ఆస్తి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే రాశి చక్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులను ప్రత్యేకంగా కొనుగోలు చేయడం వల్ల ఆనందం మీ ఇంటికి రావడంతో పాటు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. మరి మీ రాశి కూడా ఉందేమో అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.
Akshara Trutiya: అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయాలి అనే విషయానికి వస్తే..
మేష రాశి : ఈ రాశివారు అక్షయ తృతీయ సందర్భంగా ఎర్రపప్పు ను కొనుగోలు చేయాలి. ఇది మీ పుణ్యాన్ని, అదృష్టాన్ని కూడా పెంచుతుంది.
వృషభ రాశి: వృషభ రాశి వారు ఈ రాశి చక్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున బియ్యాన్ని లేదా ధాన్యాలను కొనుగోలు చేయాలి. ఇది మీ జీవితంలో ఆనందం తో పాటు శ్రేయస్సును కూడా తీసుకొస్తుంది
మిథున రాశి: అక్షయ తృతీయ రోజున మిథున రాశి వారు కొత్తబట్టలు, కొత్తిమీర ను కొనుగోలు చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు బియ్యం లేదా పాలు కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే పురోగతికి మేలు కలుగుతుంది.
సింహరాశి: సింహ రాశి వారు ఎరుపు బట్టలు లేదా రాగి పాత్రలు కొనుగోలు చేయడం వల్ల పురోగతి లో మార్పు ఉంటుంది.
కన్యారాశి: కన్యా రాశి వారు పప్పు కొనుగోలు చేయడం వల్ల తరగని పుణ్యం కలుగుతుంది.
తులారాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున బియ్యం లేదా పంచదార ను కొనుగోలు చేయడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు బెల్లం లేదా నీరు కొనుగోలు చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది.
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారు పసుపు బియ్యం లేదా అరటి పండును కొనుగోలు చేస్తే పుణ్యం పెరుగుతుంది.
మకర రాశి: మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున పప్పు ను కొనుగోలు చేయడం మంచిది.
కుంభరాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజు నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు కొనుగోలు చేయాలి.
మీన రాశి: ఈ రాశివారు పప్పు లేదా పసుపు కొనుగోలు చేయడం వల్ల అదృష్టంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.