Zodiac Signs : జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి ఈ విషయాన్ని మనం నమ్మవలసి వుంటుంది. ఎందుకంటే జ్యోతిషశాస్త్రంలో మనిషి జీవన మనుగడకు సహాయపడే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి.. ముఖ్యంగా జ్యోతిషశాస్త్రంలో గురువు శుభగ్రహం గా పరిగణిస్తారు ఇక ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం అదృష్టం గా మారుతుంది. జీవితంలో విజయం, సంపద, సంతోషకరమైన వైవాహిక జీవితం కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశుల వారికి బృహస్పతి (గురుడు) రాశి మార్పు అనేది చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ 12వ తేదీన తన ఇష్టమైన రాశీ అయినటువంటి మీన రాశిలోకి ప్రవేశించడం జరిగింది.
వచ్చే సంవత్సరం వరకు అదే రాశి లో గురువు ఉండబోతోంది . ఇక దేవగురువు హోదా కలిగిన గురుగ్రహం ఒక సంవత్సరంలో తన రాశిచక్రాన్ని మార్చుకుంటుంది. అందుకే ఇప్పుడు వారు వచ్చే సంవత్సరం వరకు అంటే ఏప్రిల్ 2023 వరకు ఈ రాశుల వారి దశ మారి పోతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తంలో గురుగ్రహం మూడు రాశుల వారికి చాలా దయగా ఉంటాడట. సంపద కూడా అధికంగా ఇస్తాడు. మరి గురు గ్రహం యొక్క అనుగ్రహం పొందిన ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
వృషభ రాశి : గురుడు మీన రాశిలోకి ప్రవేశించిన వెంటనే వృషభ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఇక రాబోయే ఒక సంవత్సరం పాటు గురు గ్రహం వల్ల వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో పెద్ద పురోగతి ఉండటంతోపాటు తాము కోరుకున్న అతిపెద్ద క్లిష్టమైన కల కూడా ఈ సంవత్సరం నెరవేరబోతోంది. ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తొలగి పోవడం ,ఇతరులకు సహాయం చేయడం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం ఇలా అన్నీ కూడా వీరికి కలిసొస్తాయి. ఇక పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులు కూడా చేసుకుంటారు.
మిధున రాశి : ఈ రాశి వారు కూడా వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలను పొందడమే కాదు జీవితంలో ఉన్నత మార్గాలను వెతుక్కోవడానికి ఈ సంవత్సరం చాలా అనువైనది. అన్ని విధాలుగా వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ ఏడాది అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది అని చెప్పవచ్చు . ఏ పని మొదలు పెట్టినా సరే విజయవంతం అవుతుంది. వీరు పెద్ద పెద్ద వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నా లేక శత్రువులపై విజయం సాధించాలన్నా ఇదే సరైన సమయం.