Samantha : ఛీ.. ఛీ.. సమంత ఎమోషనల్ అయ్యింది ఇందుకా.!?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం యశోద.. సరోగసి నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సమంత తన ఆరోగ్యం బాగో లేకపోయినా సరే ప్రమోషన్లను మొదలుపెట్టింది. తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే సమంత ఈ ఇంటర్వ్యూలో ఎమోషన్ అయ్యారు.. ప్రస్తుతం సమంతా కన్నీటి పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Samantha emotional on latest interview on suma
Samantha emotional on latest interview on suma

సమంత యశోద చిత్రానికి సంబంధించిన పలు విషయాలను సుమ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. తన ఆరోగ్యం గురించి అడగ్గానే సమంత చాలా ఫీల్ అయింది. తన ఎమోషన్ కూడా కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ముందుగా చెప్పినట్టుగానే కొన్ని రోజులు మంచివని కొన్ని రోజులు చెడ్డవని చెప్పుకొచ్చింది. తన ఆరోగ్య విషయంలో రకరకాల వార్తలు వచ్చాయని తాను ఇంకా చావలేదని సమంత చెప్పుకొచ్చింది. సమంత ఇలా ఎమోషనల్ అవ్వడానికి కారణం కూడా ఉందట.. తన ఎమోషన్ ని అడ్డం పెట్టుకొని యశోద చిత్రం చూడడానికి థియేటర్ కు ఆడియన్స్ రప్పించడానికి ఇది ఒక ఎత్తుగడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఛి ఛి సినిమా చూడడం కోసం నువ్వు ఇంతలా ఎమోషనల్ అవ్వాలా అంటూ మరో వార్త పుట్టించారు సోషల్ మీడియా రాయుళ్లు..

ఒక అమ్మాయి ఆరోగ్యం బాగోలేదని.. సోషల్ మీడియాలో తను చనిపోతాను అంటూ వస్తున్న వార్తలకు నేను ఇంకా చనిపోలేదు బ్రతికే ఉంది అంటూ ఎమోషనల్ అవ్వడం కూడా తప్పు అన్నట్టుగా తీసుకొని.. వాళ్లకు నచ్చినట్టుగా గాసిప్స్ రాస్తున్నారు కొంతమంది.. ఇప్పుడు సమంత విషయంలో కూడా అదే జరిగింది. సినిమా చూడటం, చూడకపోవటం అనేది ప్రేక్షకుల అభిప్రాయం. తన మనసులో ఉన్న బాధను షేర్ చేసుకున్నా కూడా తప్పేనా అంటూ ఆ న్యూస్ రాసిన వారిపై సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ సమంత కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రం అందర్నీ బాధించింది. నిజంగానే తను ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోగలదు. అలాగే ఈ మయోసైటిస్ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటుందని అందరూ బలంగా కోరుకుంటున్నారు. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అని అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు..