Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనకి డబ్బింగ్ చిన్మయినే చెబుతూ వచ్చింది. కాగా యూటర్న్ సినిమా నుంచి సమంత తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో.. సమంత చిన్న ఈ మధ్య గ్యాప్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.. వీరిద్దరి ఫ్రెండ్షిప్ మటాష్ అంటూ వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. కాగా సమంత చేసిన ఓ పోస్ట్ తో చెక్ పెట్టింది..
సమంత ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. కాగా ఇటీవల సమంత ఆరోగ్యం కాస్త కుదుట పడింది.. మళ్ళీ సమంత సినిమాల షూటింగ్ లో పాల్గొననుంది. ఈ మయోసైటీస్ వ్యాధి నుంచి సమంత ఇప్పుడిప్పుడే రికవరీ అవుతూ ఉంది. తాజాగా ఆమె బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న సీటాడెల్ లో నటిస్తోంది. అవెంజర్స్ సీరిస్ సినిమాల దర్శకుడు రూస్సో బ్రదర్స్ రూపొందించిన వెబ్సీరిస్కు ఇండియన్ వెర్షన్గా ఈ సీటాడెల్ తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత తన బెస్ట్ఫ్రెండ్ చిన్మయిపై సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సీటాడెల్ లోకి సమంత ఎంట్రీతో ఆమెకు చిత్ర యూనిట్ నుంచి స్వాగతం చెబుతూ ఓ పోస్ట్ విడుదల చేసింది.. ఆ పోస్ట్ పై సమంత స్నేహితురాలు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. సామ్ ప్రయాణం ఎలా.. స్టార్ట్ అయ్యిందో నాకు ఇంకా గుర్తుంది.. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రూస్సో బ్రదర్స్ ఆమెను ఆహ్వానిస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని తెలిపాడు. ఆ పోస్ట్ పై చిన్మయి స్పందించింది.
సమంత ఓ క్వీన్ అనేందుకు ఇదే నిదర్శనం అని చెప్పింది. చిన్మయి కామెంట్ పై.. నేను కాదు నువ్వే క్వీన్ చిన్మయి అంటూ.. రాహుల్ గాంధీ ఫ్రెండ్షిప్ లభించడం తన అదృష్టం అని చెప్పింది ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కాగా ఈ మాటలతో సమంత చిన్మయి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయి వీరిద్దరూ ఎంత సఖ్యతగా ఉన్నారో తెలుస్తోంది. ఇప్పటికైనా సమంతా చిన్మయి మధ్య వస్తున్న పుకార్లు ఆగితే చాలని అంత అనుకుంటున్నారు.