Prabhas : టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి ఈయన 21 కోట్ల రూపాయల అప్పు చేయడం ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. సొంత ప్రాపర్టీ పెట్టి ప్రభాస్ ఈ రేంజ్ లో లోన్ తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇకపోతే ప్రభాస్ నటించిన సాహో ఫ్రెండ్స్ బ్యానర్ లో తెరకెక్కగా రాధే శ్యామ్ సినిమా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లో వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయిన సమయంలో ప్రభాస్ తనకున్న పారితోషకంలో చాలా మొత్తం వెనక్కి చేశారు.
![Prabhas : రూ.21 కోట్లు లోన్ తీసుకున్న ప్రభాస్.. కారణం..? Prabhash has taken loan Rs.21 crores from that bank.](https://dailytelugunews.com/wp-content/uploads/2022/12/hhgr.jpg)
ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నా… సినిమాలు పూర్తి అయితే మాత్రం పూర్తి పేమెంట్ అందుతుంది. అందుకే ఇప్పుడు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులోరూ. 21 కోట్ల అప్పు తీసుకున్నారని ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి . అంతేకాదు భారీ మొత్తంలో అప్పు తీసుకున్నప్పటికీ ఆ అప్పును తక్కువ సమయంలోనే తీర్చేస్తాడని కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ప్రభాస్ ఇలా అంత డబ్బు లోన్ తీసుకోవడంతో అభిమానులు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.