Prabhas : బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెప్పించుకున్నాడు.. కానీ ఆ తరువాత ప్రభాస్ తీసిన రెండు చిత్రాలు ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయాయి.. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాల తోనైనా పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకోవాలని ప్రభాస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట..
![Prabhas : ఆ ఇమేజ్ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. వర్కౌట్ అవుతుందా.!? Prabhas precautions for protect her pan India image](https://dailytelugunews.com/wp-content/uploads/2022/12/11-2.jpg)
అయితే ఆదిపురుష్ సినిమా ఆశించిన స్థాయిలో క్రేజ్ క్రియేట్ కాలేదు. ట్రైలర్ తోనే బోల్తా పడింది. ఇక ప్రభాస్ ఆశలన్నీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రంపైనే పెట్టుకున్నాడు. సలాడ్ సినిమాలో ప్రభాస్ ఊహించని రేంజ్ లో కనిపించడంతోపాటు.. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా షూటింగ్ సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ప్రభాస్ మునుపన్నడు లేని విధంగా ఈ సినిమా షూటింగ్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ ప్రభాస్ కి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.