Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ డైరెక్టర్ అయినా సరే ఒక్కసారి తనకు హిట్ ఇచ్చాడు అంటే.. అదే డైరెక్టర్ కి వరుస ఆఫర్స్ ఇస్తాడు. ఇప్పటికే హిట్ మూవీస్ ఇచ్చిన చాలా డైరెక్టర్స్ కి అలా ఆఫర్ ఇచ్చాడు. అయితే వంశీ పైడిపల్లి కూడా మహర్షి సినిమా తర్వాత మరో ఆఫర్ ఇవ్వకుండా మంచి పని చేశాడు అని అంటున్నారు మహేష్ అభిమానులు.. ఎందుకంటే మహేష్ కు వినిపించిన వారసుడు కథల ఆయన రిజెక్ట్ చేసినదే అని టాక్..
ఇక అదే కథ ను ఆ తర్వాత తమిళ హీరో విజయ్ కి వినిపించాడట. ఇప్పుడు అదే సినిమాను విజయ్ చేస్తున్నాడు అని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక నిన్న విడుదలైన వారసుడు సినిమా ట్రైలర్ చూసిన తరువాత మహేష్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అంతా అనుకుంటున్నారు.
ఈ సినిమా కొత్త జాడీలో పాత ఊరగాయ పెట్టినట్లు ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అజ్ఞాతవాసి, మహర్షి వంటి సినిమాలను కలిపి కొట్టినట్టు అర్థమవుతుంది.. మహేష్ నిజంగా వంశీ పైడిపల్లి కి లో చెప్పి మంచి పని చేశాడని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. లేకపోతే మహేష్ వంశీ వల్ల దెబ్బైపోవడం ఖాయం అని అనుకుంటున్నారు.