Samantha : కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ది ఘోస్ట్.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఆ తరువాత నాగార్జున తన నెక్స్ట్ సినిమా అప్డేట్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. రైటర్ ప్రసన్నకుమార్ తో ఆ సినిమా తీస్తున్నారని టాక్ వినిపిస్తున్నా అఫిషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు.. ఈ విషయంపై అక్కినేని ఫ్యాన్స్ నాగర్జున పై అసంతృప్తిగా ఉన్నారు.
నాగార్జున సినిమాలు పక్కన పెట్టి యాడ్స్ చేస్తున్నాడు. ఇటీవల పూజా హెగ్దేతో కలిసి మాజా యాడ్ లో కనిపించారు. ఈ యాడ్ చూసిన ఆయన ఫ్యాన్స్ యాడ్ బాగానే ఉన్నా.. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడు బాసు అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నీ కంటే ఆ సమంతా నయం బాసు.. వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది.
నిన్న మొన్నటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కూడా శాకుంతలం సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓ వైపు అక్కినేని ఫ్యాన్స్ కూడా అదే పరిస్థితి సమంత ను చూసి.. మొన్న యశోద.. నిన్న శాకుంతలం ప్రమోషన్స్.. నేడు ఖుషి సినిమా షూటింగ్.. ఆ తర్వాత వెబ్ సిరీస్ లతో సమంత కెరీర్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ క్లారిటీ గా ఉంది. కానీ నాగార్జున మాత్రం తన నెస్ట్ సినిమా గురించి క్లారిటి ఇవ్వకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ధమాకాతో హిట్ అందుకున్న ప్రసన్న కుమార్ నాగార్జునతో కూడా ఎంటర్టైనర్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. బంగార్రాజుతో హిట్ అందుకున్న నాగ్ ది ఘోస్ట్ నిరాశపరచింది. అందుకే నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నారు నాగార్జున. మిగతా హీరోలంతా సినిమాలతో పాటు సమంత కూడా తన తదుపరి విషయంలో స్పీడ్ గా ఉంటే నాగార్జున మాత్రం చాలా లేట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. సినిమాల విషయంలో నాగ్ దూకుడు పెంచితే బెటర్ అని ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంత ముందు పరువు తిస్తున్నవు.. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చి పరువు కాపాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.