Kushboo :
స్టార్ హీరోయిన్ కుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కుష్బూ కి అభిమానులు ఆమెకు ఏకంగా గుడి కట్టి మరీ వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతలా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఖుష్బూ కి ఘోర అవమానం జరిగింది..
ఒక వైపు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా రాజకీయాలలో కూడా రాణిస్తోంది. ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కూడా జడ్జిగా వచ్చి ఆకటుకున్నరు.
ఇటీవల అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరిన కుష్బూ తాజాగా మరొకసారి అనారోగ్యం పాలయ్యింది. తన కాలుకి గాయం అయ్యింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గాయం అయినా తన ప్రయాణం ఆగదని ఖుష్బు తెలిపింది
ఈ మంగళవారం రోజున వేరే రాష్టానికి వెళ్లడం కోసం చెన్నై విమానాశ్రయానికి వెళ్ళారు. కాగా అక్కడ కుష్బూ కి చేదు అనుభవం ఎదురయింది.
కాలికి గాయం అవటంతో నడవలేక వీల్ చైర్ కావాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరాను.30 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత.. వేరే విమానయాన సంస్థ వద్ద నుంచి తెచ్చిన వీల్ చైర్లో నన్ను పంపించారు. వీల్ చైర్ కోసం అరగంట పాటు నేను కాలు నొప్పిని భరిస్తూనే ఎదురు చూశాను .ఎయిర్ ఇండియా సంస్థకు ఒక వీల్చైర్ ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కూడా లేదా అంటూ ఎయిర్ ఇండియా సంస్థ మీద కుష్బూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుష్బూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. గుడి కట్టి కొలిచే ఆమె అభిమానులు ఈ విషయం తెలిసి ఎయిర్ ఇండియా పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఛీ ఛీ వీళ్ళు మనుషులేనా అంటూ పోస్టులు చేస్తున్నారు. కాలికి గాయమైందని వీల్ చైర్ అడిగితే అరగంట నిలబెడతారా అంటూ సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు.