Eye Problems : రెడ్డివారి నానుబాలు మొక్క మనం నిత్యం చూస్తూనే ఉంటాము.. ఈ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిస్తే.. వాటి ప్రయోజనాలు పొందడం తేలికే.. రెడ్డివారి నానుబాలు మొక్క కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.. ముఖ్యంగా కంటి సమస్యలకు అద్భుతంగా చెక్ పెడుతుంది ఈ మొక్క.. ఇంకా ఏ సమస్యలను నయం చేస్తుందంటే..రెడ్డివారి నానుబాలు మొక్క ఆకులను తుంచితే వాటి నుంచి పాలు కారతాయి.
ఈ పాలను రెండు చుక్కలు కంట్లో వేసుకుంటే కంటి పొరలు, కంటి మసకలు పోతాయి. అంతేకాకుండా కంటి పుండ్లు కూడా తగ్గుతాయి. ఈ మొక్క దృష్టిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. పొరపాటున ఏవైనా కంట్లో గుచ్చుకొని కంటి నుంచి రక్తం కారుతున్నప్పుడు.. మరలా కంటి చూపును తీసుకువచ్చే శక్తి రెడ్డివారి నానుబాలు మొక్కకు ఉంది. అన్ని రకాల దృష్టి సమస్యలను నివారిస్తుంది.
కంటి కలక, కంటి నుంచి నీరు కారడం, కంటిలో ఉన్న దుమ్మ ధూళిని కూడా పొగోడుతుంది.ఈ పాలను పులిపిర్లు ఉన్నచోట రాస్తే అవి రాలిపోతాయి. అంతే కాకుండా ఈ చెట్టు పాలను పెదవులపై రాస్తూంటే పెదవుల పగుళ్లు పోయి పెదాలు మృదువుగా మారతాయి. పెదాలను అందంగా మారుస్తుంది. అదేవిధంగా శరీరంపై గాయాలు, పుండ్లు ఉన్నచోట ఈ పాలను రాస్తే అవి త్వరగా మానిపోతాయి. గజ్జి, తామర, దురద ఉన్నచోట ఈ పాలు రాస్తే చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.