పసుపు, వేప రెండూ కూడా యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. ఈ రెండింటిలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. వీటి నుంచి మనం అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక ఈ రెండింటినీ కలిపి కనుక వాడినట్లయితే అనేక రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. పసుపులో ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ ఈ, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక వేపలో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ డయాబెటీస్ వంటి గుణాలు కూడా ఉంటాయి.
అందుకే వేపాకు ,పసుపు కలిపి తీసుకుంటే శరీరాన్ని మనం బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి వాటి నుంచి సులభంగా కాపాడవచ్చు.. పసుపు, వేప తో తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ దూరం అవడమే కాదు మొటిమలు కూడా తగ్గిపోతాయి. వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల అలర్జీలు కూడా తగ్గిపోతాయి. ఇక గాయాలపై పసుపు, వేపాకు తో తయారు చేసిన మిశ్రమాన్ని రుద్దితే ఎంత పెద్ద గాయం అయినా సరే తగ్గిపోతుంది. వేప ఆకులు వేసి నీరు ఆకుపచ్చగా మారే వరకు బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు ఆకు పచ్చగా మారిన నీటిని షాంపూ తో కలిపి జుట్టును కడగాలి . ఇలా చేస్తే చుండ్రు సమస్య కూడా దూరమవుతుంది.