Nagarjuna : టాలీవుడ్ మన్మథుడిగా అమ్మాయిల కలల రాకుమారుడిగా నాగార్జున సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ నాగార్జున అంటే అమ్మాయి పడి చస్తుంటారు. ఒకవైపు సినిమాలు మరోవైపు టీవీ షోస్ తో నాగార్జున అదరగొట్టేస్తున్నాడు. సీనియర్ హీరో అయినా సరే కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు కింగ్ నాగార్జున. ఇక త్వరలో హై యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యి.. రిలీజ్ కు సై అంటోంది. గుంటూర్ టాకీస్ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు ఇక ది ఘోస్ట్’ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది.
Nagarjuna : కింగ్ కింగే..
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ది ఘోస్ట్ ఈ సినిమా అక్టోబరు 5న దరసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా 100 కోట్లు క్రాస్ చేసి ఆ క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నాగార్జున తన కెరియర్ లోని ఫస్ట్ టైం 55 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంత రెమ్యునరేషన్ ఇప్పటి వరకు ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కూడా తీసుకోలేదని తెలుస్తుంది.
హీరో నాగచైతన్య ఫుల్ వరస ఫ్లాప్ సినిమాలతో కెరీర్ డిజాస్టర్ గా మలుచుకున్నాడు . లవ్ స్టోరీ తర్వాత ఆయన చేసిన థ్యాంక్యూ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు పలు సినిమాలు చేస్తుండగా, ఈ సినిమాలపై నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇక అఖిల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆయన సొంత హీరోగా ఆయన సొంత టాలెంట్ తో పెట్టు కొట్టిన సినిమా ఒక్కటి కూడా లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినప్పటికీ . అది కాస్త పూజా హెగ్డే ఖాతాలోనే పడిపోయింది. ఇప్పుడు ఏజెంట్ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక నాగ్ సినిమా విషయానికి వస్తే.. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈమూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్ కి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.