Smart TV : 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.7,999కే.. ఫీచర్స్ ఏమిటంటే..?

Smart TV : Smart TV ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉన్నట్లుగానే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా స్మార్ట్ టీవీలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇక ఇండియన్ మార్కెట్లోకి రోజుకొక స్మార్ట్ టీవీ.. సరికొత్త ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో స్మార్ట్ టీవీలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వినియోగదారులకు నచ్చిన విధంగా ఈ స్మార్ట్ టీవీలు రోజుకొక ఫీచర్ తో ముందుకు రావడం జరిగింది. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ లు రోజుకొక ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వీటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలు కొనాలని అనుకునేవారికి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో టీవీ కొనుగోలు చేసే వారికి ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. మరి స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి.. వెస్టింగ్ హౌస్ కంపెనీ నుంచి 32 ఇంచులు కలిగిన టీవీ కేవలం రూ.7,999 కే సొంతం చేసుకోవడం గమనార్హం.

మరి ఈ స్మార్ట్ టీవీ యొక్క పూర్తి ఫీచర్స్, వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ఇకపోతే భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ టీవీలను పరిచయం చేయడం జరిగింది. ఇక ఈ కొత్త టీవీ లలో స్మార్ట్ మరియు నాన్ స్మార్ట్ విభాగాలలో కూడా అందించనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ టీవీ కేవలం 7,999 ధరలో పొందడం విశేషం.. ఇకపోతే ఈ టీవీలను 32, 43, 50 ఇంచుల పరిమాణంలో హెచ్డి మరియు యు హెచ్ డి రిజల్యూషన్ తోన్ఈ స్మార్ట్ టీవీ లు రానున్నాయి. ఇకపోతే పిక్చర్ క్వాలిటీ, సౌండ్ టెక్నాలజీ మరియు స్మార్ట్ఫోన్ యూజర్ల తో సరికొత్తగా ఈ స్మార్ట్ టీవీ లు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇక ఈ కొత్త టీవీలో వుండే ఫీచర్స్ విషయానికి వస్తే.. 32 ఇంచులు హెచ్డీ రెడీ టీవీ నాన్ స్మార్ట్ టీవీ, 2 HDMI, 2USB పోర్ట్ ల తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది . ఈ టీవీ MP 3/ WMA ఆడియో ఫార్మాట్లకు మద్దతు ఇచ్చే ఆడియో ఈక్వ లైజర్ ను కలిగి ఉంటుంది. ఇక 20W సౌండ్ ఔట్ పుట్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది గరిష్టంగా 350 నిట్స్ బ్రైట్నెస్ కూడా అందించగలదు. మంచి పిక్చర్ క్లారిటి ని కూడా ఈ స్మార్ట్ టీవీ ద్వారా పొందవచ్చు అని , థియేటర్ ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది అని కూడా కంపెనీ వారు తెలియజేస్తున్నారు.

The 32-inch Smart TV features just Rs 7,999
The 32-inch Smart TV features just Rs 7,999

ఇక కేవలం మీరు 7999 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఇక 43 ఇంచుల అలాగే 50 ఇంచుల టీవీ విషయానికి వస్తే ఈ రెండు కూడా ఫోర్ కె అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీలు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.. ఇక వీటి ధరలు విషయానికి వస్తే 43 ఇంచుల ఫోర్ కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ ధర రూ.20,999 ఉండగా 50 ఇంచుల ఫోర్ కె అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ ధర రూ.27,999 గా ధరలు నిర్ణయించబడింది ఇక ఈ టీవీ లో మనకు 2gb RAM 8gb ROM అలాగే 3 హెచ్డిఎమ్ ఐ పోర్ట్ అలాగే టు యూ ఎస్ బి పోర్ట్ లను కూడా కలిగి ఉంటాయి. ఇక ఈ రెండు టీవీలు కూడా మంచి విజువల్స్ అందించడానికి వీలుగా hdr10 సపోర్టుతో వస్తాయి. ఇక సౌండ్ పరంగా చూసుకుంటే ఈ రెండు టీవీలు కూడా డిజిటల్ నాన్ ఫిల్టర్ అలాగే సరౌండ్ సౌండ్ టెక్నాలజీ కి మద్దతు ఇచ్చే 40W స్పీకర్ ఔట్ పుట్ ను కూడా కలిగి ఉంటాయి. ఇక ఈ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పని పని చేస్తాయి. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అనేక ఆప్స్ , గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు జూన్ 13వ తేదీ నుంచి అమెజాన్ లో వినియోగదారులకు స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి