Samantha : సమంత లేటెస్ట్ పిక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్..!

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం యశోద. లేడీ ఓరియంటెడ్ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఆ ఫోటోలో ఫోటోలు చూసిన ఆమె అభిమానులు, నెటిజన్స్ సమంత పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

Samantha latest pics viral on social media after Myositis
Samantha latest pics viral on social media after Myositis

ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత కండరాల సమస్యలతో బాధపడుతున్నా కానీ తన డబ్బింగ్ తానే పూర్తి చేసుకుంది. పైగా డబ్బింగ్ చెప్పేటప్పుడు చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెప్పింది అంటే తనకు ఎంత డెడికేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత తన లేటెస్ట్ పిక్స్ కొన్నింటిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలలో సమంత చాలా డల్ గా నీరసంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన చాలా మంది అయ్యో పాపం సమంత ఇలా అయిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అభిమానులైతే కన్నీళ్లు పెట్టుకున్న ఏమోజీ లను షేర్ చేస్తున్నారు. సమంత త్వరగా కోలుకోవాలి అంటూ ప్రార్థిస్తున్నారు.

క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి కలెక్షన్స్ వస్తాయి అంటున్నారు ట్రేడ్ నిపుణులు. యశోద సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు ఏకంగా 8 కోట్ల రూపాయల లాభం వచ్చిందని టాక్. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు అనుకున్న రేంజ్ కంటే మంచి బిజినెస్ జరిగిందట. దీనికి తోడు అటు ఓటీటీ ఇటు శాటిలైట్ రైట్స్ కూడా మంచి డిమాండ్ ఉండడంతో నిర్మాతలు ఫుల్ ఖుషి అవుతున్నారట. ఇక విడుదలకు ముందే యశోద ఈ రేంజ్ లో లాభాలను అందుకోవటంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయట. అంతేకాదు కొందరు హీరోలు సైతం సమంత సినిమాకు అప్పుడే లాభాలా అంటూ అసూయ పడుతున్నారట.