Money : పైసల షేర్.. లక్షల్లో ఆదాయం..!!

Money : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలో డబ్బు ఎక్కువగా సంపాదించాలనే ఆలోచనతో స్టాక్ మార్కెట్లను ఎంచుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. డబ్బులు పెట్టేటప్పుడు రిస్క్ తో పాటు నియమ నిబంధనలు కూడా మనం పాటించాల్సి ఉంటుంది. ఇకపోతే ఒక్కోసారి నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. స్టాక్ మార్కెట్ విలువ పెరిగింది అంటే చాలు కళ్లు చెదిరేలా లాభాలను తీసుకొచ్చి పెడుతుండటం గమనార్హం. ఇక ఈ సంవత్సరం ఎన్నో కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట కురిపిస్తున్నాయి. అలాంటి వాటిలో ఖూబ్ సూరత్ లిమిటెడ్ కూడా ఒకటి.

ఇకపోతే గత ఆరు నెలల వ్యవధిలో స్టాక్ మార్కెట్ ఏకంగా ఒక్కొక్క షేర్ ధర దాదాపుగా 1, 975 శాతం ర్యాలీ చేసింది. అంతేకాదు ఇందులో పెట్టుబడి పెట్టినవారికి కూడా బాగా కాసులు వర్షం కురిపిస్తూ ఉండడం విశేషం. ఇకపోతే ఖూబ్ సూరత్ కంపెనీ యొక్క షేర్ ధర 20 పైసలు ఉండగా ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.4.15 వద్ద కొనసాగుతోంది. అంటే కేవలం నాలుగు నెలల్లో ఏకంగా 1975 శాతం ర్యాలీ చేసి మంచి లాభాలను అందించింది.. ఇకపోతే 2022 లో ఇప్పటివరకు 698.08 శాతం రాబడిని ఇవ్వడం గమనార్హం. దీని యొక్క షేర్ విలువ ఒక నెలలోనే.. రూ.1.79 నుంచి ఏకంగా రూ.4.15 పెరిగింది. అంటే కేవలం నెల రోజుల్లోనే 131.84 శాతం పెరిగింది.

With an paise share Income in lakhsof Rs. 24 lakhs profit can be obtained
paise share Income in lakhs

ఈ ఖూబ్ సూరత్ లిమిటెడ్ స్టాక్ లో సుమారుగా నాలుగు నెలల క్రితం పెట్టుబడిదారుడు ఏకంగా లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఉండి ఉన్నట్లయితే.. ఈ రోజు మొత్తంగా రూ 20.75 లక్షలు అతని చేతికి వచ్చేది. అంటే కేవలం నాలుగు నెలల్లోనే ఎంతటి పేదవాడైనా సరే లక్షాధికారి అయ్యేవాడు. అందుకే చాలామంది ఆచితూచి అడుగులు వేస్తూ సరైన షేర్ మార్కెట్ ను పెంచుకుంటూ డబ్బులు ఇన్వెష్ట్ చేస్తున్నారు. అలాగే కొన్ని లక్షల రూపాయలను లాభాలు కింద పొందుతూ ఉండడం గమనార్హం.