Janhvi Kapoor : శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆనతి కాలంలో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది జాన్వీ. శ్రీదేవిని పోలిన లుక్స్తో అభిమానులకు కనులవిందు చేస్తూ అలరిస్తుంది. హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది యువ హీరోయిన్ జాన్వీ కపూర్. తన తల్లి దివంగత నటి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ నటనతో అందచందాల విషయంలో కూడా అదరగొడుతున్న జాన్వీ వరుస సినిమాలతో సందడి చేస్తున్నప్పటికీ అవి పెద్దగా అలరించలేకపోతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన రాబోయే మూవీ ‘మిలి’ ప్రమోషన్స్లో భాగంగా తెగ సందడి చేస్తుంది.
అన్ని బాధలు పడిందా..
ఇటీవల చిత్ర ప్రమోషన్లో భాగంగా జాన్వీ కపూర్ ఓ థియేటర్లో ఫ్యాన్స్ స్వయంగా పాప్కార్న్ సర్వ్ చేశారు. కౌంటర్ వెనుక నుంచి జాన్వీ కపూర్ పాప్కార్న్లు సర్వ్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక మిలి చిత్రానికి మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించగా, ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇది మలయాళ చిత్రం హెలెన్కి రీమేక్.గా రూపొందింది. మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలలో నటించడం జరిగింది. కొద్ది రోజులుగా జాన్వీ కపూర్ మిలి ప్రమోషనల్ యాక్టివిటీస్లో బిజీగా ఉండగా, తాజాగా ఆమె సినిమా కోసం ఎంత కష్టపడిందో వివరించింది.
మిలీ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బిజీగా ఉన్న జాన్వీ.. తాజగా ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఈ సినిమా కోసం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను.. ఈ సినిమాలో నేను మిలీ నౌదియల్ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాదు సినిమాలో తన పాత్రకు తగ్గట్టు దాదాపు 7 కేజీల బరువు పెరగవలసి వచ్చింది. దర్శకుడు సూచన మేరకు పాత్రకు సెట్ అయ్యేలా అనుకున్న బరువును సక్సెస్ ఫుల్ గా పెరిగాను. ఈ బరువు తగ్గాలంటే అదో పెద్ద ప్రాసెస్ అని చెప్పింది. ఈ సినిమా వల్ల మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడిందని పేర్కొంది జాన్వీ కపూర్. షూటింగ్ లో తాను పోషించిన పాత్రలు.. కలలో వచ్చి నిద్రకూడా సరిగ్గ పట్టక ఆరోగ్యం పూర్తిగా పాడయ్యిందట. నాలుగైదు రోజులు పెయిన్ కిల్లర్స్ కూడా వాడాల్సి వచ్చిందని తన బాధలు చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.