హిందూ సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఈ క్రమంలోని వాస్తు శాస్త్రానికి చాలామంది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇందుకు కారణం ఏమిటంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుని ఆ ఇంట్లో ఉండే వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చినట్లయితే ఇంట్లో సుఖ శాంతులు, సిరిసంపదలు, ఆర్థికవృద్ధి పెరగడం కెరియర్లో మరిన్ని లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీరు కూడా వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటి నుండే పనిచేస్తూ ఉన్నట్లయితే ఈ నాలుగు చిట్కాలు పాటించారంటే మీ వృత్తిలో అభివృద్ధి పెరగడమే కాకుండా ఆర్థిక సంపద కూడా పెరుగుతుంది. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మీరు ఎక్కడైనా పనిచేయడం మొదలు పెడితే మీ ఆఫీస్ ను దేవాలయంలా భావించాలి.
ఒకవేళ మీరు వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో పని చేస్తున్నట్లు అయితే ఒకే ప్రదేశంలో ని పని చేయడం చాలా మంచిది. కుర్చీలో కూర్చుని పని చేయడం , మంచం మీద పడుకొని పనిచేయడం లాంటివి చేయకూడదు. ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకొని అందులో కూర్చొని పనిచేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. అంతే కాదు మీరు ఉపయోగించే టేబుల్ కూడా దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారంలో ఉండేలా మాత్రమే నిర్మించుకోవడం తప్పనిసరి. ఇక రౌండ్ టేబుల్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు.పని చేసేటప్పుడు తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిక్కు వైపు కూర్చొని పని చేసేటట్టు మాత్రమే చూసుకోవాలి.
![Financial Money : ఈ 4 చిట్కాలు పాటిస్తే ఆర్థిక సంపద పెరిగినట్టే..!! Following these 4 tips will increase your Financial Money](https://dailytelugunews.com/wp-content/uploads/2022/03/Money-1.jpg)
ఇలా ఆ దిక్కు వైపు తిరిగి పని చేసుకోవడం వల్ల మీ తెలివితేటలు మరింత పెరుగుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మీరు పనిచేయడానికి కూర్చునే దిశ గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల మీ మనస్సు చంచలంగా మరి ఆందోళనకు కూడా గురి అవుతారు.. త్వరగా అలసిపోతారు. కర్పూరం తో దీపం వెలిగించడం.. సాంబ్రాణి పొగ వేయడం.. మనసుకు నచ్చిన రంగులు ఇంటి గోడలపై వేయడం లాంటివి చేస్తే కచ్చితంగా ఇల్లు ఆహ్లాదం గా మారడమే కాకుండా ఆర్థిక సంపద కూడా పెరుగుతుంది.