Veera Simha Reddy: నందమూరి నరసింహ బాలకృష్ణ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం వీర సింహారెడ్డి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కలెక్షన్లను వసూలు చేస్తుంది.. కలెక్షన్లతోపాటు రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు బాలయ్య. టాలీవుడ్ లో టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాలలో తన సినిమాను కూడా నిలబెట్టేశాడు.. ఏకంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా కలెక్షన్స్ ని బీట్ చేశాడు..
![Balakrishna Veera SimhaReddy movie first day collections beat allu Arjun record](https://dailytelugunews.com/wp-content/uploads/2023/01/images-2023-01-17T100329.200-300x157.jpeg)
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది.. పుష్ప సినిమా రెండు రాష్ట్రాలలో కలిపి మొదటి రోజే 24.90 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తాజాగా ఈ షేర్ ను నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి 25.36 కోట్ల షేర్లతో దాట్టేసింది.
అంతేకాదు మొదటి రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో 15వ స్థానంలో నిలిచింది. ఇక ఈ లిస్టులో 74.11 కోట్ల షేర్ తో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ముందు స్థానంలో ఉంటే.. సెకండ్ ప్లేస్ లో కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 ఉంది. ఇక వీర సింహారెడ్డి సినిమా రోజురోజుకీ కలెక్షన్ల భారంగా పరంగా తన సత్తా చాటుతున్నాడు బాలయ్య..
ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే బన్నీ క్రియేట్ చేసిన అతి పెద్ద రికార్డును బాలయ్య ఇంత త్వరగా బీట్ చేస్తాడని అల్లు అరవింద్ అస్సలు అనుకోలేదట .ఒక విధంగా ఆయన కూడా హ్యాపీగా ఫీలయ్యారట. మొత్తానికి పుష్ప రెండు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ని బాలయ్య బీట్ చేసేసాడు..