Financial : సోమవారం మహాదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఇక జీవితంలో కష్టాలు తీరి పురోభివృద్ధి కి బాటలు తెరుచుకునేలా శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ముఖ్యంగా సోమవారం రోజున మాత్రమే కొన్ని రకాల ప్రత్యేకమైన పూజలు చేస్తే .. శివుని అనుగ్రహం పొంది ఆయురారోగ్యం తో పాటు ఆర్థిక లాభం కూడా పొందవచ్చు. ముఖ్యంగా సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించడం వల్ల త్వరగా ప్రసన్నుడౌతాడని భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ఇకపోతే సోమవారం రోజున ఉపవాసం ఉండి స్వామివారికి పూజలు చేస్తే కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. మహాదేవుడు ప్రసన్నుడై భక్తుల మనోభావాలను తెలుసుకుని వాటన్నింటిని తీరుస్తారు అట. జీవితంలో కష్టాలు తొలగిపోయి.. పురోభివృద్ధికి బాటలు తెరుచుకునేలా శివుడు చేస్తాడు అని భక్తులు నమ్ముతారు. సోమవారం రోజున శివుడికి చేయాల్సిన ప్రత్యేక పూజల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ఇంట్లో డబ్బుకు కొరత లేకుండా ఉండాలి అంటే.. సోమవారం రోజున శివలింగంపై పాలు కలిపిన నీటిని పోయాలి. ఇక అదే సమయంలో రుద్రాక్ష జపమాల నుండి సుమారు 108 సార్లు ఓం సోమేశ్వర నమః అని జపించాలి.
![Financial : ఆర్థిక లాభం పొందాలి అంటే సోమవారం రోజు ఈ పని చేయాల్సిందే..!! To make a financial profit means to do this work on Monday](https://dailytelugunews.com/wp-content/uploads/2022/04/Mpney.jpg)
ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతులు గా అయ్యే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడినా.. వివాహానికి ఆటంకము కలిగినా సోమవారం రోజున శివుడి ఆలయంలో గౌరీశంకర్ రుద్రాక్ష ను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్యంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. పితృ దోషం ఉన్నట్లయితే సోమవారం రోజున నల్లనువ్వులను కలిపిన పచ్చి బియ్యం తో సోమవారం సాయంత్రం దానం ఇవ్వడం వల్ల పితృదోష ప్రభావం తగ్గుతుందని, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని సమాచారం. ఇలాంటి ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.