Financial Problems : ఏప్రిల్ 30 ఎందుకంత ప్రత్యేకత అంటే 2022 సంవత్సరానికిగాను మొట్టమొదటి శని అమావాస్య రాబోతోంది. అందులోనే ఆ రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అత్యంత పవిత్రమైనదిగా పండితులు చెబుతున్నారు.. ఇక ఈ రోజున న్యాయ దేవుడైన శని దేవుడిని భక్తి శ్రద్ధలతో పూజించి.. ప్రసన్నం చేసుకోవడం వల్ల మన పై ఉన్న దుష్ప్రభావాలు తొలగిపోతాయట. ముఖ్యంగా శని అమావాస్య రోజు కొన్ని పనులను చేయడం వల్ల పునరుత్పాదక ఫలితాలు అంది మనకు అంత మంచే జరుగుతుంది.
ఇక ఈ శని అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, శుక్రుడు , రాహువుకు చిహ్నంగా ఉప్పు పరిగణించబడుతుంది. ఆర్థిక సమస్య ను తగ్గించుకోవడానికి శని అమావాస్య రోజున కొన్ని ఉప్పు నివారణలు చెప్పబడ్డాయి. ఇక అవేమిటి అనే విషయానికి వస్తే.. శని అమావాస్య రోజున నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం నాశనం అవుతుంది. అంతే కాదు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండేలాగా చేస్తుంది.
![Financial Problems : ఏప్రిల్ 30 న ఇలా చేశారు అంటే ఆర్థిక సమస్యలన్నీ పరార్..!! This was done on April 30, which means all financial problems will be solved](https://dailytelugunews.com/wp-content/uploads/2022/03/Financial-Problems-india.jpg)
ముఖ్యంగా దరిద్ర దేవత మీ ఇంట్లో ఉన్నట్లు మీకనిపిస్తే వెంటనే ఇలా చేయండి .కేవలం శని అమావాస్య రోజు మాత్రమే కాదు మీకు కుదిరితే ప్రతి రోజు కూడా నీటిలో ఉప్పు వేసుకుని ఇల్లు శుభ్రం చేస్తే అంతా శుభమే కలుగుతుంది.శని అమావాస్య రోజు ఒక గ్లాస్ లో కొద్దిగా నీరు తీసుకుని.. అందులో ఉప్పు కలపాలి. దానిని నైరుతి దిశలో ఉంచి, ఎరుపు రంగు బల్బు కూడా వెలిగించాలి. ఇక గ్లాస్ లో నీరు అయిపోయినప్పుడు.. మళ్ళీ నీటితో నింపి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇక ఇలాంటి ఆర్టికల్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కాబట్టి వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా అందరికి షేర్ చేయండి.