Puja : ఉద్యోగం రావడం లేదా.. అయితే ఈ పూజ చేయాల్సిందే..!

Puja : ప్రతి వార్షిక సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. కానీ అందరికీ ఉద్యోగాలు లభిస్తున్నాయి అంటే లేదు అని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది ఉన్నత విద్య చదివి సరైన ఉద్యోగం లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శని గ్రహం కాకుండా మరొక గ్రహం వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ఇటీవల జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక అదే రాహువు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువును పాపగ్రహం .. ప్రాముఖ్యత లేని క్రూరమైన గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు.

ముఖ్యంగా రాహు దోషాన్ని వదిలించుకోవడానికి ప్రత్యేకమైన మంత్రాన్ని జపించాలి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు రాహు మంత్రాన్ని జపించడం వల్ల వెంటనే సానుకూల ప్రభావాన్ని పొందవచ్చు.రాహువు సుమారుగా 18 సంవత్సరాల తర్వాత వృషభ రాశి నుంచి మేష రాశి లోకి మారుతున్న నేపథ్యంలో ఏడాదిన్నర పాటు ఈ రాశిలో ఉంటాడు. ప్రస్తుతం మేష రాశి లో రాహువు ప్రవేశించడం వల్ల వీరి జాతకంలో రాహువు, కుజుడు శివ స్థానంలో ఉన్నారు. కాబట్టి రాహు మార్పు వారికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.. అన్ని రాశుల వారికి ఇది ప్రభావితం చేయబోతోంది.

This puja is to be done while getting a job or not
This puja is to be done while getting a job or not

ముఖ్యంగా రాహువు ను శుభప్రదంగా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అంటే ప్రతి గురువారం రోజు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల రాహువు యొక్క దోషాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం కూడా ఎట్టిపరిస్థితుల్లో తీపి పదార్థాలను తినకూడదు.. ఇక ఓం నమశ్శివాయ.. మహా మృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు జపించడం వల్ల రాహు శాంతి ఇస్తాడు ఉద్యోగం లభిస్తుంది.” ఓం రణ్ రహ్వే నామ్ ” అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల రాహువును శాంతి పరచడంతో పాటు చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఈ మంత్రాన్ని పఠిస్తే తప్పకుండా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడవచ్చు.