Lakshmi Devi : దీపం అనేది ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా ఆ ఇంటి పెద్ద యొక్క ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది అని బహుశా చాలా మందికి తెలియదు అని చెప్పాలి. నిజానికి ఉదయం , సాయంత్రం తప్పకుండా పూజ గదిలో దీపం వెలిగించడం వల్ల కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే తీరిపోతాయి. అంతేకాదు బయటకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చేవరకు ఆ ఇల్లాలికి దీపం తోడుగా ఉంటుందట. ఇక ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వల్ల స్వర్గలోకంలో ఆ దీపం తన ఇంటి వారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడమే కాక నలుగురిలో మర్యాద పొందుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇలాంటి దీపం పూజ గదిలో వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది.. ఆమె మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.. ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అప్పుడు సిరిసంపదలకు లోటు ఉండదు.ఇంట్లో మట్టి దీపం వెలిగించడం వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి . ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఎలాంటి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనే విషయాలను తెలుసుకోవడానికి ముందుగా ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియ చేయాలంటే వాట్సప్ లేదు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి
నెయ్యి దీపం : హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయులు దీపం వెలిగించకుండా ఏ పూజా కార్యక్రమాలలో కానీ , వేడుకలు కానీ నిర్వహించరు. దీపం వెలిగించిన తరువాత అనే అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. మట్టి ప్రమిదలో నెయ్యి పోసి వత్తి పెట్టి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి సిరిసంపదలు తాండవం చేస్థాయి. . లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే తప్పకుండా ఇలాంటి దీపం పూజ గదిలో వెలిగించాలి.
అరటి దారం : అరటి కాడతో దారం లాగా పోగులను మెలి తిప్పి దీపం వెలిగించడం వల్ల మనకు తెలియకుండానే మనం చేసిన పాపాలు తొలగిపోతాయి. దేవుడు క్షమిస్తాడు అని భక్తుల నమ్మకం.