Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేశారు అంటే డబ్బుకు లోటు ఉండదట..!

Vastu Shastra : సమాజంలో ఎవరైనా సరే అప్పుల బాధలు ఉండాలని అసలు కోరుకోరు. ఎంత కష్టపడినా సరే ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అప్పులు చేయవలసిన సమయం వస్తుంది. ఇక అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎన్నో కష్టాలు కూడా పడాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి వాస్తు దోషం కూడా అప్పుల భారానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మీరు నివసించే ఇంట్లో అలాగే పనిచేసే దుకాణాలలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు.

ఇక లక్ష్మీదేవి , కుబేరుడు విగ్రహం ఇంట్లో లేదా దుకాణాలలో ఉత్తర దిక్కున ఉండేలా చూసుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి, ఉత్తరాది నుంచి వచ్చిన కుబేరుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండడం వల్ల ఉత్తరదిశలో లక్ష్మీదేవి విగ్రహం ఉంచి పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇంకా కొంతమంది ఇళ్లల్లో భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దారిద్ర్యం ఏర్పడడం, డబ్బు నష్టం జరగడం వంటివి జరుగుతాయి. ఇక డబ్బు ఉన్నా కూడా అదృష్టం వరించదు అని నిపుణులు తెలియజేస్తున్నారు.

According to Vastu Shastra, this was done because there was a deficit of money
According to Vastu Shastra, this was done because there was a deficit of money

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిక్కులలో ఉండేలా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అప్పుల భారం పెరగదు అని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం అప్పుల బాధలు తీరి పోకుండా ఉన్నట్లయితే మొదటి వాయిదా మంగళవారం రోజున మాత్రమే చెల్లించడం వల్ల తీసుకున్న అప్పు కూడా త్వరగా తీరుతుంది. ఇక మీరు ఉపయోగించే బాత్ రూమ్ కూడా నైరుతిదిశలో అస్సలు ఉండకూడదు. నైరుతి దిశలో బాత్రూం ఉన్నట్లయితే ఆ మూలలో ఉప్పు తో నిండిన కుండ ను ఉంచినట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇలా వాస్తు దోషం తో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి.