Vijay Devarakonda : బాలీవుడ్ బడా నిర్మాత.. హోస్ట్ గా కరుణ్ జోహార్ ఇటీవలే ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన చాట్ షో “కాపీ విత్ కరణ్” సీజన్ ను తాజాగా విజయవంతంగా ముగించారు. అయితే నిర్మాత విషయానికి వస్తే కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా తర్వాత ఒకటి భారీ సినిమాలను విడుదల చేయడంలో బిజీగా ఉన్నారు.. ఇటీవల రణబీర్- కపూర్ అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రను ప్రమోట్ చేశారు. సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్నా కరణ్ జోహార్ సోషల్ మీడియా సైట్ అయిన ట్విట్టర్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు అభిమానులందరికీ షాక్ ఇచ్చారు.. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే.!?
కరణ్ జోహార్ ట్విట్టర్ నుంచి తన ఖాతాను తొలగించారు.. ఈరోజు ముందు మైక్రో బ్లాకింగ్ సైట్ కి వెళ్లి కరెంటు జోహార్ ఒక ట్వీట్ చేశారు..” మరింత సానుకూల శక్తుల కోసం మాత్రమే స్థలాన్ని తయారు చేయడం కోసం మాత్రమే స్థలాన్ని మాత్రమే ఇవ్వాలి.. ఇది దానవైపు ఒక అడుగు అంటూ వీడ్కోలు ట్విట్టర్..!” అని పోస్ట్ చేశారు.. దర్శక నిర్మాత సైట్ నుండి తన ప్రొఫైల్ ను తొలగించారు. ఎందుకు గల కారణాలు ఏమిటో అస్పష్టంగా ఉన్నప్పటికీ.. బందు ప్రీతి జెండా మోసేవాడిగా ట్యాగ్ చేయబడిన కరుణ్ జోహార్ సంవత్సరాలు తరబడి విపరీతమైన ట్రోలింగ్స్ ను ఎదుర్కొన్నారు..
నిజానికి కాఫీ విత్ కరణ్ ముగింపులో కరుణ్ మానసిక ఆరోగ్యం గురించి చికిత్స చేయించుకోవడం అతనికి ఎలా సహాయపడిందో కూడా వివరించారు.. ఇక నుంచి కరణ్ అప్డేట్లను ట్విట్టర్ లో కోల్పోతాము కానీ తప్పదు. ఇటీవల భారీ అంచనాల హోప్స్ తో రిలీజ్ చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ డిజాస్టర్ అవడంతో కరుణ్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమాకి సంబంధించి కూడా విపరీతమైన నెగిటివ్ ని ఎదుర్ కొన్నారు. ఈ బాధల్ని మరిచేందుకు ఇప్పుడు కరణ్ ఈ ట్విట్టర్ ఖాతా నుంచి ఎగ్జిట్ అవుతున్నారని మరికొందరు భావిస్తున్నారు.. లైగెర్ కరణ్ కి శాపం అయ్యిందా అంటే నిజమే అంటున్నారు నెటిజన్స్..